ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు జనం తోసుకుంటూ పరుగులు తీస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను పెంచారు. ఈ సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది, ఇందులో RPF మహిళా కానిస్టేబుల్ ఒకరు చంటిబిడ్డను ఎత్తుకొని, మరో చేత్తో లాఠీని పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
బిడ్డ తో కలిసి విధులు నిర్వహిస్తున్న ఈమెను సోషల్ మీడియాలో సెల్యూట్ అమ్మ అని ప్రశంసిస్తున్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి