శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నిర్మిస్తున్న అమీర్ రాజా బ్యాటరీ కంపెనీలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులు మంటలు ఎగిసి పడడంతో గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కామెంట్ను పోస్ట్ చేయండి