ములుగు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు. జాతరకు వెళ్లే సమయంలో ఇళ్లలో ఎవరు లేని పరిస్థితిని దొంగలు ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల విలువైన వస్తువులు, నగదు సురక్షితంగా ఉంచుకోవాలని, తాళాలు బలంగా వేసి వెళ్లాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

కామెంట్ను పోస్ట్ చేయండి