బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక వద్ద నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో మూడు కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నాగబిక్షం ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ లో, అరెస్టయిన నిందితులు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వాళ్ళ నేమ్స్ చెప్పడం లేదు???
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి