రాజస్థాన్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రాజస్థాన్లోని జైపుర్-అజ్మేర్ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రహదారి అంతా మంటలతో అల్లకల్లోలంగా మారింది. సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..
చౌటుప్పల్: జాతీయ రహదారిపై కారులో మంటలు
Oct 08, 2025,
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద హైదరాబాదు నుండి వైజాగ్ వెళ్తున్న ఎంజి ఇట్రా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తి సకాలంలో అప్రమత్తమై బయటకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలకలం రేగింది.

