కృషికి దక్కిన ఫలితం
- గంజాయి నిర్మూలనలో ఎస్సై విజయలక్ష్మి మార్క్
- రివార్డు తో అభినందించిన డిజిపి
- తెలంగాణ వ్యాప్తంగా 65 మంది పోలీసులు ఎంపిక
- భద్రాద్రి జిల్లా నుంచి 35 మంది పోలీసులు ఎంపిక
- ఎంపికైన వారిలో ఒకే ఒక్క మహిళా పోలీసు అధికారిణి విజయలక్ష్మి
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, భద్రాచలం:
భద్రాచలం పట్టణంలో ఎస్సై -1 గా విధులు నిర్వహించిన జీ. విజయలక్ష్మికు అరుదైన గౌరవం లభించింది. మూడు రాష్ట్రాలకు అనుబంధమైన భద్రాచలం చెక్ పోస్టు మీదుగా గంజాయి తరలి వెళ్లకుండా అరికట్టడంలో తన ప్రతిభ చాటారు. విజయలక్ష్మి కృషికి గాను పోలీస్ శాఖ డిజిపి రివార్డుతో అభినందించారు. రివార్డుకు మొత్తం 65 మంది పోలీసు అధికారులు ఎంపికవగా.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 35 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. అందులో కేవలం ఒకే ఒక్క మహిళ పోలీస్ అధికారిణి విజయలక్ష్మి మాత్రమే ఉండడం విశేషం.
LOCAL AD:
కామెంట్ను పోస్ట్ చేయండి