చతిస్గడ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది, బీజాపూర్ జిల్లాలో సౌత్ వేస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి, ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి...
మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్న ట్టు పోలీసులు తెలిపారు. కాగా, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు.
వీటిలో ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్ స్థలం లో నలుగురు మావోయిస్టు ల మృత దేహాలు లభ్యమ య్యాయని, పోలీసులు తెలిపారు.
కామెంట్ను పోస్ట్ చేయండి