పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఉప్పాక బ్రిడ్జి వద్ద మంగళవారం ఎస్ఐ రాజకుమార్ వాహన తనిఖీలు నిర్వహించగా.. ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయి కేజీ 300 గ్రాములు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, భూపాలపట్నం పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
పట్టుబడ్డ వ్యక్తులు పినపాక మండలం తోగ్గుడెం గ్రామానికి చెందిన సునారి ఆదిత్య, సత్యేంద్ర లోకేష్.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి.... అశ్వాపురం: చికెన్లో పురుగుల కలకలం....
إرسال تعليق