ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాల్లో శుక్రవారం 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 14 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నారాయణ్ పూర్ జిల్లాలో 9 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్సీ ఎదుట వారు లొంగిపోయారు.
إرسال تعليق