పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డును అందుకున్న కొత్తగూడెం త్రీటౌన్ సిఐ శివప్రసాద్ ను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 


భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 


జూన్ 2వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నందు జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డును అందుకున్న కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ గారిని ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఈ అవార్డును దక్కించుకోవడం జరిగింది.పోలీస్ శాఖలో క్రమశిక్షణ,నిబద్ధతతో పనిచేసే అధికారులు,సిబ్బందికి ఎప్పటికైనా ప్రత్యేక గుర్తింపు,గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ కూడా పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది